Thursday, May 2, 2024

AP: గ్రాఫిక్స్ అనేది చంద్రబాబు పేటెంట్: మంత్రి కాకాణి సెటైర్

గ్రాఫిక్స్ అనేది చంద్రబాబు పేటెంట్ అని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి కాకాణి గోవర్థన్ ఫైర్ అయ్యారు. బాపట్ల జిల్లా మేదరమట్లలో వైసీపీ సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది..ఆ సభకు వచ్చిన జన సంద్రాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారని అన్నారు. అందుకే వైసీపీ సిద్ధం సభపై దుష్ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. జనం రాకున్న గ్రాఫిక్స్‌లో వచ్చినట్లు చూపిస్తున్నారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపైన ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతి విషయంలో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళితో చంద్రబాబు గ్రాఫిక్స్ చేయించారని అన్నారు.

గ్రాఫిక్స్‌లో జనం వచ్చినట్లు చూపించాల్సిన అవసరం తమకు లేదని.. జగన్ పట్ల ప్రజలు కృతజ్ఞతతో ఉన్నారన్నారు. చేసిన అభివృద్ధిని వివరించుకుంటూ సీఎం జగన్ జనంలో తిరుగున్నారు.. చంద్రబాబు ఏమో అధికారం కోసం పొత్తు అంటూ ఇతర పార్టీల చుట్టూ తిరుతున్నారని సెటైర్ వేశారు. జనం లేని పార్టీకి పవన్ కల్యాణ్ సేనాని అని ఎద్దేవా చేశారు. 2019లో చంద్రబాబు తన తల్లిని అమానించారన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు వాళ్లు కాళ్లు పట్టుకుంటున్నారని నిలదీశారు. కూటమి వచ్చిన.. ఎవరెన్ని కుట్రలు చేసిన మరోసారి వైసీపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement