Friday, May 10, 2024

ఏపీ అసెంబ్లీలో ప్రారంభ‌మైన‌ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం : అడ్డుకుంటున్న టీడీపీ స‌భ్యులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని తెలుగుదేశం పార్టీ స‌భ్యులు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకుంటున్నారు. ఒక వైపు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం, మ‌రో వైపు టీడీపీ స‌భ్యుల నినాదాల‌తో స‌భ హోరెత్తింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగ ప్ర‌తుల‌ను టీడీపీ స‌భ్యులు చించివేసి పోడియంపై విసిరేసి తీవ్ర నిర‌స‌న తెలుపుతున్నారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల నినాదాల‌తో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం వినిపించ‌డం లేదు. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను కాపాడలేని గ‌వ‌ర్న‌ర్ గో బ్యాక్ అంటూ టీడీపీ స‌భ్యులు నినాదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement