Friday, April 26, 2024

ఆ రూ.400 కోట్లపై జగన్ సర్కార్ కన్ను: గోరంట్ల సంచలన ఆరోపణ

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం డబ్బులు లేక అప్పుల ఊబిలో ఉందన్నారు. తాజాగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లపై కన్ను పడిందని గోరంట్ల ఆరోపించారు. ఆ డబ్బుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి మళ్లించేందుకు దుష్ట ఆలోచన చేసిందని చెప్పారు. కెనరా బ్యాంకునుంచి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఒక్క పక్క ఉద్యోగుల సంఘాల ఆందోళన చేస్తున్న పట్టించుకోకుండా విద్యాలయాల అభివృద్ధి సొమ్ముతో ప్రభుత్వం సోకులు చేస్తాను అనంద దుర్మర్గపు చర్య అని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement