Sunday, May 19, 2024

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఉచిత దర్శనం టోకెన్లు ప్రారంభించిన‌ టీటీడీ

తిరుమల శ్రీవారి ఉచిత దర్శనానికి ఉచిత టోకెన్ల జారీని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్రారంభించింది. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈరోజు టోకెన్ తీసుకున్న వారికి రేపటి నుంచి దర్శనానికి అనుమతిస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లను ఇవ్వ‌నున్నట్టు టీటీడీ తెలిపింది. ఉచిత దర్శనం టోకెన్ల కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉత్తరాది నుంచి వచ్చిన కూడా భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement