Thursday, May 2, 2024

కడప రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్

కడప క్రైమ్- ప్రభ న్యూస్ . కడప రైల్వే స్టేషన్ సమీపంలోని ఎర్రముక్కపల్లి వైపు ఉన్న గేటు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది, మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బియ్యం లోడ్ తో వచ్చినటువంటి గూడ్స్ రైలు షెడ్డులోకి వెళ్లి రివర్స్ కొట్టే ప్రయత్నంలో ఉండగా రెండు బాక్సులు పట్టాలు పట్టాలు తప్పడం జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు స్వల్పంగా ఆర్థిక నష్టం ఉన్నప్పటికీ రవాణాకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు అన్నట్లు అధికారులు దృవీకరిస్తున్నారు,

కడప వైపు నుంచి తిరుపతి వైపు వెళ్లే ప్యాసింజర్ రైళ్లు ప్రస్తుతానికి ఏవి లేవని రాత్రి 12 గంటల సమయం కి వచ్చే గుంటూరు ప్యాసింజర్ రైలు సమయానికల్లా అధికారులు రైలు పట్టాను పునరుద్ధరించే అవకాశం ఉందని తెలిపారు, కడప నుంచి ముంబై వైపు వెళ్లే రైలు మార్గం కు మాత్రం ఎటువంటి ఆటంకం లేదని తెలిపారు. సగటుల ప్రాంతాన్ని వెంటనే అధికారులు పర్యవేక్షించిన ర రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు ఆర్పీఎఫ్ సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు జరిగింది, రైల్వే లైన్ పట్టాల పునరుద్ధరణ కోసం వెంటనే సంబంధిత రిక్రూట్మెంట్తో గుంతకల్ నుంచి కడపకు అధికారులు సంబంధిత సామాగ్రితో బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement