Thursday, May 2, 2024

ముంద‌స్తుకు వెళ్లినా, జ‌గ‌న్ ఇంటికెళ్ల‌డం ఖాయం: చంద్ర‌బాబు జోస్యం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నెత్తి మీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రేపో ఎల్లుండో సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని చంద్రబాబు జోస్యం చెప్పారు. రోజు రోజుకూ పతనావస్థకు వెళ్తున్నారని, మరిన్ని రోజులు గడిస్తే వ్యతిరేకత పెరుగుతుందని సీఎం జగన్ భయపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని, సీఎం జగన్ పక్కా బిజినెస్ మ్యాన్ అని, ప్రతి రోజూ ఎంత సంపాదించామోనని గల్లా పెట్టే చూసుకుంటూ ఉంటారని చంద్రబాబు ఆరోపించారు. మహిళల క్యారెక్టర్‌ను దెబ్బ కొట్టడం వైసీపీ పనిగా పెట్టుకుందని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో తన భార్యను కించపరిచారని, ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ.. ఇప్పుడు కానీ.. భువనేశ్వరి ఎప్పుడైనా రాజకీయాల్లో కన్పించారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement