Friday, May 17, 2024

నెల్లూరులో గ్యాస్‌ లీకేజీ ముగ్గురు మృతి..

నెల్లూరు జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ అయ్యింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వింజమూరు మండలం చండ్రపడియాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో చోటు చేసుకుంది. గ్యాస్‌ లీకేజీతో ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు… ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. గతంలోనూ ఫ్యాక్టరీలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఎన్నోసార్లు ఆందోళనలు చేసిన స్థానికులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement