Sunday, May 26, 2024

నేటి నుంచి ఒంటిపూట బడులు.. పదో తరగతి విద్యార్థులకు యథావిధిగా

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ ఆదివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులుంటాయన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు మాత్రం పరీక్షల దృష్ట్యా రెండు పూటలా యథావిధిగా తరగతులు, స్టడీ అవర్స్‌ జరుగుతాయని వివరించారు. ఉదయం 7.30 నుంచి 11.30 వరకు అసెంబ్లిd, ఆరు పిరియడ్లు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement