Thursday, May 2, 2024

చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా

ఏపీలో టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా చిత్తూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టిడిపికి మాజీ మంత్రి కుతూహులమ్మ, ఆమె తనయుడు హరికృష్ణ గుడ్ బై చెప్పారు. జిడి నెల్లూరు నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న హరిక్రిష్ణ… 2019 ఎన్నికల్లో నారాయణ స్వామిపై పోటీ చేసి ఓడిపోయారు. జిల్లా పార్టీ నేతల సూచనపై ఇటీవలే చిట్టిబాబు అనే వ్యక్తిని ఇటీవల నియోజకవర్గ కోఆర్డినేటర్ గా పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. దీంతో అప్పటి నుంచే అసంతృప్తితో ఉన్న కుతూహలమ్మ, ఆమె తనయుడు హరికృష్ణ… పార్టీ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమ రాజీనామాలను ఫ్యాక్స్ ద్వారా పార్టీకి అధిష్టానానికి పంపించారు.

ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ తో నేను మాట్లాడా.. ప్రకాష్ రాజ్ పోటీ చేయొచ్చు: మంచు విష్ణు

Advertisement

తాజా వార్తలు

Advertisement