Sunday, May 19, 2024

AP | రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బండారు..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణ ప్రకటించారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో మనస్తాపం చెందిన ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

విశాఖలోని పరవాడ మండలంలో ఏర్పాటు చేసిన సభలో సత్యనారాయణ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయంగా ఇదే తన చివరి భేటీ అని కార్యకర్తలు, అభిమానులతో అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement