Tuesday, May 7, 2024

Breaking: కుప్పం ద్ర‌విడ వ‌ర్సిటీలో ఫుడ్ పాయిజ‌న్‌.. 30 మందికి అస్వ‌స్థత‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చిత్తూరు జిల్లాలోని ద్ర‌విడ వ‌ర్సిటీలో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం ప‌రిధిలోనే ద్ర‌విడ వ‌ర్సిటీ ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్సిటీలోని అక్క మ‌హాదేవి హాస్ట‌ల్ లో ఉంటున్న విద్యార్థినులు తీసుకున్న ఆహారం విష‌తుల్యంగా మారింది. దీంతో ఈ ఆహారం తీసుకున్న వారిలో 30 మంది స్టూడెంట్స్‌ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని వర్సిటీ అధికారులు హుటాహుటీన హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. వీరిలో ఆరోగ్యం విష‌మంగా ఉన్న 17 మందిని ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం విద్యార్థునుల‌ ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement