Tuesday, April 30, 2024

AP: పేరుపాలెం బీచ్ లో.. స్నానానికెళ్లి ఐదుగురు గల్లంతు…

తణుకు, అక్టోబర్ 22 (ప్రభ న్యూస్): దసరా సెలవులు కావడంతో విహారయాత్రకు పేరుపాలెం వెళ్లి సముద్ర స్నానం చేస్తుండగా ఐదుగురు గ‌ల్లంత‌య్యారు. గల్లంతైన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

తణుకు పట్టణం బొమ్మల వీధికి చెందిన సుమారు పది మంది ఆదివారం పేరుపాలెం బీచ్ కు వెళ్లారు. వీరిలో ఐదుగురు సముద్ర స్నానానికి దిగి గల్లంతు కాగా.. ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. గొరస సావిత్రి (35), అనుపోజు వసంత కుమార్ (18), అనుపోజు రఘువర్మ (26) గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement