Wednesday, May 1, 2024

NLR: బోటులోనుంచి జారిపడి మత్స్యకారుడు మృతి

ముత్తుకూరు, నవంబర్ 2 (ప్రభ న్యూస్) సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంముత్తుకూరు మండలం నేలటూరు పాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు చించింగారి పోలయ్య( 27) వేట సాగిస్తున్న బోటులో నుంచి జారిపడి దుర్మరణం చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత నెల 28న నేలటూరు సముద్ర తీర ప్రాంతం ద్వారా బోటుపై సహచర మత్స్యకారులతో కర్ణాటక రాష్ట్రం మంగుళూరు సముద్రతీరంలో చేపల వేట సాగించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ బోటు లో నుంచి ప్రమాదపుశాత్తు జారిపడి సముద్ర గర్భంలో మునిగిపోయారు. గురువారం మృతదేహాన్ని కర్ణాటక రాష్ట్రం అధికార యంత్రాంగం బయటికి తీశారు. మృతుడి కి భార్య పిల్లలువున్నారు. మృతదేహన్ని శవపంచనామ నిమిత్తం ఆ రాష్ట్రం పోలీసులు ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పోలీస్ కేసు నమోదు చేశారనిమత్స్యకారులు తెలిపారు. మృతి చెందిన విషయాలను స్థానిక సర్పంచ్ భక్తాని కనకయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement