Wednesday, May 1, 2024

Fire Brand – డెవిల్ ఈజ్ బ్యాక్ – జ‌న‌సేన అంతు తేలుస్తా..

తిరుప‌తి – త‌న‌కు ఆరోగ్యం బాగలేదని కొంతమంది సంతోషపడుతున్నారని,.. డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..! అని వ్యాఖ్యానించారు మంత్రి రోజా.. తిరుప‌తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, .. ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. మరోరోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు.. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతూన్నాడో అర్థం కాదు అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లు వేశారు. ఎందుకు పార్టీ పెట్టాడో అతనికే తెలియద‌ని,.. ప్రజల ఏమి చేస్తావో చెప్పకుండా జగన్, వైసీపీ నేతలపై చీప్‌గామాట్లాడుతున్నార‌ని పైర్ బ్రాండ్ అన్నారు. …

రాజకీయాల్లో వచ్చింది సేవ చేయడానికా? లేక అధికార పార్టీ నేతలను కొట్టడానికా? అంటూ ప‌వ‌న్ ను నిల‌దీశారు. అమ్మవారి పేరు వాహనానికి పెట్టుకుని బూతుపురాణం చేబుతున్నార‌ని,.. ప్రజలు దృష్టిలో పవన్‌ విలన్‌గా మారుతున్నార‌ని హింట్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పవన్ బూతులు మాట్లాడుతున్నారని అంటూ.. ఇప్పటికైన చిరంజీవి చెప్పిన మాట పవన్ వింటే మంచిదని హితవుపలికారు..ఇక రాబోయే ఎన్నిక‌ల‌లో గుంపులుగా వచ్చినా.. విడివిడిగా వచ్చినా 2024లో గెలిచేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే.. జగనే సీఎం రాసిపెట్టుకో జ‌న‌సేనాని అంటూ భ‌విష్య వాణి వినిపించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement