Tuesday, May 21, 2024

Big Breaking | ప‌ర‌వాడ ఫార్మాసిటీలో ఫైర్ యాక్సిడెంట్‌.. మంట‌ల్లో న‌లుగురు స‌జీవ‌ద‌హ‌నం

అన‌కాప‌ల్లి ద‌గ్గ‌రున్న ప‌ర‌వాడ ఫార్మాసిటీలో ఇవ్వాల (సోమ‌వారం) కొద్ది సేప‌టి క్రితం ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగింది. ఈ అగ్ని ప్ర‌మాదంలో న‌లుగురు చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. మంట‌ల్లో ప‌డి న‌లుగురు స‌జీవ ద‌హ‌నం అయిన‌ట్టు స‌మాచారం అందుతోంది. మ‌రో వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. యూనిట్ 3లో మంట‌లు చెల‌రేగ‌డంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు ప్రాథ‌మిక స‌మాచారం అందుతోంది. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి మంట‌లార్పేందుకు య‌త్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement