Sunday, April 28, 2024

Financial Capital – విశాఖ‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు భ‌వ‌నాలు కేటాయింపు

విశాఖపట్నం ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించ‌డ‌మే కాకుండా ఈ ఏడాది చివరలో రాజధానిని అమరావ‌తిని విశాఖకు తరలిస్తామని తెలిపిన ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఉండేందుకు నివాసంతోపాటు క్యాంపు కార్యాలయాల ఎంపిక పూర్తి కావ‌డ‌మే కాకుండా అక్క‌డ నిర్మాణాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

తాజాగా అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రిషికొండ మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను హై లెవెల్‌ కమిటీ గుర్తించింది. మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్‌ను కేటాయించారు.

ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కమిటీ నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని వెల్లడించారు. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement