Friday, May 3, 2024

AP: కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారిని సినీ నటి హన్సిక దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు.

ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. మై నేమ్ ఈజ్ శృతి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నగరానికి వచ్చిన హన్సిక మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైస్ గా తన చిత్రం రిలీజ్ కానుందని, ప్రేక్షకులందరూ తన చిత్రాన్ని ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement