Monday, April 29, 2024

భూమా, సుబ్బారెడ్డిల మధ్య వర్గ పోరు – రణరంగంగా లోకేష్ పాదయాత్ర (వీడియోతో)

యువ గళం యాత్రలో రణరంగం

.నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గీల పరస్పర దాడి.

కర్నూల్ – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం యాత్ర నంద్యాలలో రణరంగంగా మారింది. మంగళవారం సాయంత్రం నంద్యాల నియోజకవర్గంలో యాత్ర ప్రారంభం కాగానే పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి తన అనుచరులతో పాల్గొనే ప్రయత్నం చేశారు. అంతకుముందే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అయితే ఇది వర్గాలు యాత్రలో పాల్గొనే సందర్భంలో పరస్పర వాగువాదం చోటుచేసుకుంది. ఈ విషయం చిలికి చిలికి గాలి వానల మారడంతో నారా లోకేష్ ఎదుటే భూమా, ఏవి అనుచరులు దాడికి దిగారు.

ఒకరిపై ఒకరి పిడుగులు గుద్దుకున్నారు. ఏవి సుబ్బారెడ్డి పై అఖిలప్రియ అనుచరులు దాడికి దిగారు, ఆయన రోడ్డుపై పారేసి కాళ్లతో తన్నడం కనిపించింది. ఈలోగా ఏవి అనుచరులు కూడా అఖిలప్రియ అనుచరులపై దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగమును మరిపించింది. పరిస్థితిని గ్రహించిన పోలీసులు ఇరువర్గాలను చదర గొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంఘటన అనంతరం పాదయాత్ర నుండి నేరుగా పట్టణ తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకొని ఏవి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement