Sunday, May 5, 2024

Fiber Grid Case – చంద్రబాబు ముంద‌స్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా…

అమ‌రావ‌తి – ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణను అక్టోబర్ 4 వరకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్ట్ వెల్లడించింది. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు పేరు ఉందని ఆయన లాయర్లు చెబుతున్నారని, తాము దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలను తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే తమకు వాయిదా కావాలని సీఐడీ తరపున లాయర్లు చెప్పడంతో విచారణను కోర్ట్ వాయిదా వేసింది. కాగా చంద్రబాబుపై సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలోనే చంద్రబాబు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement