Wednesday, May 1, 2024

AP: బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య..

విజయనగరం(కొత్తవలస), ప్రభ న్యూస్ : విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కుమార్తె మృతిచెందారు. ఎం.డి.మొహినుద్దీన్‌ (46) తన కుటుంబంతో కలిసి విశాఖ నగరం మర్రిపాలెం పరిధిలోని ఎఫ్‌సీఐ నగర్‌లో నివాసముంటున్నారు.

సోమవారం సాయంత్రం భార్య సంషినిషా (39), కుమార్తె ఫాతిమా జహీదా (17), కుమారుడు అలీతో కలిసి కొత్తవలస సమీపంలోని చింతపాలెంలో తమ స్థలం చూసేందుకు వెళ్లారు. అనంతరం అక్కడే బావిలో దూకారు. ఈ ఘటనలో మొహినుద్దీన్‌, అతడి భార్య, కుమార్తె చనిపోగా.. కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు. కొత్తవలస పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement