Sunday, April 28, 2024

Fake Votes – తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు – మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి సస్పెండ్‌

తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల ఘటనలో మరో అధికారిపై వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రస్తుతం విజయవాడ మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తిరుపతి ఉప ఎన్నిక సమయంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్‌గా పనిచేసిన చంద్రమౌళి ఆ తరువాత విజయవాడ మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆర్‌వో లాగిన్‌తో 35వేల ఓటరు కార్డులు డౌన్‌లోడ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దొంగ ఓట్ల వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement