Tuesday, July 23, 2024

AP | వారికి గుడ్ న్యూస్.. పోలింగ్ బ్యాలెట్ గడువు పొడిగింపు

పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోలింగ్ బ్యాలెట్ గడువును ఏప్రిల్ 26 వరకు పొడిగించినట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు ముఖేష్ కుమార్ మీనా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పీవో, ఏపీవో, పోలీసులు, సెక్టార్ ఆఫీసర్లు, వీడియో గ్రాఫర్లు మొదలైన వారు తాము పనిచేస్తున్న చోటే ఫారమ్ 12 సమర్పించవచ్చని తెలిపారు. ఆ తర్వాత వాటిని వారి వారి సొంత నియోజకవర్గానికి పంపేలా ఈసీ చర్యలు తీసుకుంది. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటేసేందుకు వీలుగా వారికి ఒకరోజు క్యాజువల్ లీవ్ ఇస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇక ఎన్నికల విధుల్లో ఉద్యోగులతో పాటు అత్యవసర సేవల సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతే ఈసీ ఈ అవకాశం కల్పిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement