Monday, April 29, 2024

Extended – వివేకా హ‌త్య కేసు నిందితుల‌కు రిమాండ్ పొడిగింపు…

హైద‌రాబాద్ – మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. జులై 14 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్ ముగియ‌డంతో నేడు కోర్టులో హాజ‌రుప‌రిచారు పోలీసులు.. దీంతో న్యాయ‌మూర్తి వారి రిమాండ్ ను 14వ తేది వ‌ర‌కూ పొడిగిస్తూ ఉత్త‌ర్వ‌లు ఇచ్చారు..

దీంతో తిరిగి వారంద‌ర్ని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఈరోజు విచారణ సందర్భంగా కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యక్తుల పేర్లను సీబీఐ ప్రస్తావించింది. కాగా, నేటితో సిబిఐ విచార‌ణ కోర్టు ఆదేశాల‌తో పూర్తి కావాల‌సి ఉంది.. దీనిపై నేడు ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement