Friday, April 26, 2024

మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ కన్నుమూత

హైదరాబాద్ – మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ కుమార్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మూడేళ్ల క్రితమే వసంత్ కుమార్ భార్య చనిపోయింది. వారికి పిల్లలు లేకపోవడంతో బంధువుల అబ్బాయిని దత్తత తీసుకున్నారు. వట్టి వసంత్‌కుమార్‌ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పూండ్ల గ్రామం. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడిగా వట్టి వసంతకుమార్ పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్‌ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement