Monday, May 6, 2024

ఇచ్ఛాపురంలో ఏనుగుల హల్ చల్

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఏనుగులు హల్ చల్ చేశాయి. ఒడిశా సరిహద్దులోని ముచ్చింద్ర గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లోకి ప్రవేశించి కల్లాల్లో రైతులు భద్రపరచుకున్న సుమారు 50 బస్తాలు ధాన్యాన్ని స్వాహా చేశాయి. మరికొన్ని బస్తాలను ధ్వంసం చేశాయి. నష్టపోయిన రైతులను అధికారులు వివరాలు సేకరించారు. మరోవైపు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులెవరూ అటు వైపు వెళ్లవద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement