Tuesday, April 30, 2024

తిరుమలలో ఏనుగుల గుంపు సంచారం

తిరుమలలో ఏనుగుల గుంపు సంచారంతో భక్తులు భయపడుతున్నారు. ఏనుగుల మంద గత నాలుగురోజులుగా పాపవినాశనం రహదారి వెంట సంచరిస్తున్నాయి. పాపవినాశనంలోని పార్వేట మండపం వద్ద తిరుగుతున్నాయి. ఆకాశగంగ ప్రాంతంలో రోడ్లపైకి వచ్చిన ఏనుగులు వాహనదారులను వెంబడించాయి. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు టీటీడీ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుమల వైపునకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement