Friday, May 10, 2024

మే 5న ఐదు మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు.. నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎస్‌ఈసీ

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐదు మండల పరిషత్‌ అధ్యక్షలు, ఉపాధ్యక్షుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. శుక్రవారం ఎస్‌ఈసీ నీలం సాహ్నీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఐదు మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికను మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, కృష్ణాజిల్లా ఉంగుటూరు, పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అలాగే కోనసీమ జిల్లా రాయవరం మండల పరిషత్‌లో ఇద్దరు ఉపాధ్యక్ష ఎన్నిక కూడా నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో ఎస్‌ఈసీ వెల్లడించింది.

మే 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ నీలం సాహ్నీ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంలోని మరో 13 జిల్లాల్లోని 26 మండలాల పరిధిలో ఉన్న 26 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా ఎస్‌ఈసీ విడుదల చేసింది. ఈ ఎన్నిక కూడా మే 5 ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో ఎస్‌ఈసీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement