Thursday, May 2, 2024

Elections – ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం నూతన కార్యవర్గం ఇదే..

గుంటూరుఅర్బన్, మే 23(ప్రభన్యూస్) : ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం తృతీయ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు మంగళవారం గుంటూరు అన్నమయ్య గ్రంథాలయంలో నిర్వహించినట్లు అధ్యక్షుడు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, కార్యదర్శి ఎస్‌.ఎమ్‌.సుభాని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గంలో అధ్యక్షుడిగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య (గుంటూరు జిల్లా), ప్రధాన కార్యదర్శిగా చలపాక ప్రకాష్‌ (ఎన్టీఆర్‌ జిల్లా), కోశాధికారిగా నానా (నారిశెట్టి సత్యనారాయణ) (గుంటూరుజిల్లా)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. ఉపాధ్యక్షులుగా డా|| వెలువోలు నాగరాజ్యలక్ష్మి (గుంటూరు), పొన్నూరి వేంకట శ్రీనివాసులు (ప్రకాశం జిల్లా), పి.హరికృష్ణారెడ్డి (చిత్తూరు), ఎ.జయప్రకాష్‌ (నెల్లూరు జిల్లా), ఎస్‌.ఆర్‌.పృథ్వీ, (తూ.గో.జిల్లా), రాధేయ (అనంతపురం), మాధవీ సనారా (అనకాపల్లి జిల్లా), బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి (గుంటూరు) ఎన్నికయ్యారని తెలిపారు. కార్యదర్శులుగా ఎస్‌.ఎమ్‌.సుభాని (గుంటూరు జిల్లా), కె.జె.రమేష్‌ (పల్నాడు జిల్లా), సి.ఎన్‌.చంథ్రేఖర్‌ (చిత్తూరు), బుర్రి కుమార్‌ రాజా (శ్రీకాకుళం), పి.లక్ష్మణరావు (విజయనగరం), శర్మ సిహెచ్‌ (ఎన్టీఆర్‌ జిల్లా) ఎన్నికయ్యారని, కార్యవర్గ సభ్యులుగా కోపూరి పుష్పాదేవి (ఎన్టీఆర్‌ జిల్లా), ఎమ్‌.ఆర్‌.వి. సత్యనారాయణమూర్తి (ప||గో|| జిల్లా), ఎస్‌.కాశీంబి (గుంటూరు జిల్లా), సలహా మండలి సభ్యులుగా అడిగోపుల వెంకటరత్నం (చిత్తూరు), కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ (ఎన్టీఆర్‌ జిల్లా), గబ్బిట దుర్గాప్రసాద్‌ (కృష్ణా) ఎన్నికైయ్యారని తెలిపారు. వీరు 2023-2026 సంవత్సరాలకు గాను తమ పదవీ బాధ్యతలు నిర్వర్తిసారని ప్రకటనలో తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement