Sunday, April 28, 2024

AP: ఎపిలో ముగ్గురు ఐఎఎస్, ఆరుగురు ఐపిఎస్ ల‌పై ఈసి వేటు

అమ‌రావ‌తి – ఎపిలో ముగ్గురు ఐఎఎస్, ఆరుగురు ఐపిఎస్ ల‌పై ఈసి వేటు వేశారు.. కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ పి రాజాబాబు, అనంతపురం క‌లెక్ట‌ర్ ఎం.గౌతమి, తిరుపతి కలెక్ట‌ర్ లక్ష్మీషాల‌ను వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని ఈసి అదేశాలు జారీ చేశారు.. అలాగే ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై కూడా బ‌దిలీ వేటుప‌డింది.. ఈ అధికారుల‌ను ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సీఇఓ కు ఆదేశాలు జారీ చేసింది ఎన్నిక‌ల సంఘం.

అలాగే ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానల్ పంపాలని కోరింది. బ‌దిలీ అయిన వారిలో చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ లు ఉన్నారు. కాగా గుంటూరు రేంజ్ ఐజి పాలరాజు ను కూడా బదిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement