Thursday, May 2, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రి మృతి.. ఐదుగురికి గాయాలు..

కాకినాడ జిల్లాలోని తుని రూరల్ వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధ‌వారం తెల్ల‌వాడుజామున ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ ఆటో ఢీ కొట్ట‌డంతో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు విజయనగరం జిల్లా, దీనికల పట్టి నుంచి రామచంద్రపురంలో ఓ శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement