Wednesday, May 1, 2024

రేపు కొవ్వూరులో సీఎం జగన్ పర్యటన..

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 24న (రేపు) సీఎం వైఎస్‌ జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో జ‌గ‌న్ నగదు జమచేయనున్నారు. ఈ మేరకు సీఎంఓ షెడ్యూల్ విడుదల చేసింది. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతి నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జ‌గ‌న్ కొవ్వూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement