Monday, May 6, 2024

చైతన్య లో బాలల దినోత్సవం…

మండపేట : నేటి బాలలే రేపటి  దేశ పౌరులని చాచా జవహర్ లాల్ నెహ్రు పేర్కొనేవారని  చైతన్య స్కూల్ ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ అన్నారు. మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీచైతన్య స్కూల్‌ లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధులు సుభాష్‌ చంద్రబోస్‌,జాతిపిత గాంధీజీ, చాచా నెహ్రు, ఝాన్సీలక్ష్మీబాయిల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. స్కూల్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ.. వేషధారణలలో చిన్నారులను చూస్తుంటే అలనాటి స్వాతంత్ర సమరయోధులు తమ కళ్ల ఎదుటే తిరుగుతున్నట్లు ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధుల జీవిత కథలను విద్యార్థులకు వివరించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్‌, ప్రైమరీ ఇంచార్లు నరేష్‌, ఉమ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement