Sunday, May 19, 2024

Durgamma temple – శ్రావణ పౌర్ణమి నుంచి అమ్మవారి భక్తులకు ప్యాకెట్లలో ఉచితంగా కుంకుమ పంపిణీ

విజయవాడ,ఆగస్టు 28 (ప్రభ న్యూస్): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా కుంకుమను పంపిణీ చేసే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు ప్యాకెట్ల రూపంలో కుంకుమను అందించనున్నారు

.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, వందన దంపతులు దేవస్థానం లో భక్తులకు అమ్మవారి ప్రసాదముగా ఉచితంగా పంపిణీ చేయుటకు గాను రూ.2 లక్షలు పైగా విలువ జేయు కుంకుమ ప్యాకెట్లు ప్యాకింగ్ చేయు యంత్రము , అందుకు కావలసిన రూ.3,60,000 విలువ జేయు ముడి సరుకు (కవర్లు, ఇతరములు)ను వారి మిత్రులు ఎం.వి సుధాకర్ ద్వారా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ ని కలిసి దేవస్థానం నకు విరాళముగా అందజేశారు.

సోమవారం ఈ మెషిన్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఈ యంత్రమును చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహనాధికారి భ్రమరాంబ పరిశీలించి ప్రారంభించారు. శ్రావణ పౌర్ణమి నుండి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులందరకూ కుంకుమ ప్రసాదం ప్యాకెట్ల రూపములో అందజేయనున్నట్లు చైర్మన్ కర్నాటి రాంబాబు కార్యనిర్వాహణాధికారి భ్రమరాంబ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు చింకా శ్రీనివాసులు, నంబూరి రవి, బచ్చు మాధవీ కృష్ణ, తొత్తడి వేదకుమారి, కార్యనిర్వాహక ఇంజినీరు లింగం రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement