Thursday, May 16, 2024

KNL: కరువు అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే కరువు… మంత్రి గుమ్మనూరు

రాష్ట్రంలో కరువు అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే కరువు… అని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మంత్రి క్యాంప్ కార్యాలయం నందు మంత్రి గుమ్మనూరు జయరాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో జగనన్న సురక్ష విజయవంతమైనది అని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో కరువు చాయలు అలముకున్నాయని ఆయన తెలిపారు.

జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదన్నారు. ప్రాజెక్టులు నిర్మించడం ఒక్క జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని తెలిపారు. రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. హంద్రీ నీవా ద్వారా ఉమ్మడి రాయలసీమ జిల్లాలను సస్య శ్యామలం చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి నారాయణస్వామి, మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు, సచివాలయ కన్వీనర్లు ఈరన్న, మల్లికార్జున, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement