Sunday, April 28, 2024

Big Breaking | డోంట్​ వర్రీ.. ఓటర్​ లిస్టులో తప్పులుంటే ఇంటింటి తనిఖీలు: ముఖేశ్​ కుమార్​ మీనా​

ఆంధ్రప్రదేశ్​లో ఓటర్ల జాబితాపై ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్​ 17వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్​ కుమార్​ మీనా చెప్పారు. ఇవ్వాల (సోమవారం) మీడియాకు ఈ విషయం తెలియజేశారు. ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాబితాలో కనుక తప్పులుంటే ఇంటింటికీ వచ్చి తనిఖీలు చేసి మరీ సవరిస్తామన్నారు. ఇక.. ఓటర్ల తుది జాబితా వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement