Sunday, April 28, 2024

AP: ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా అభివృద్ధి..విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం..వైవీ సుబ్బారెడ్డి

విశాఖ వైఎంసిఏ సమీపంలో ఫ్లోటింగ్ బ్రిడ్జినీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ బీచ్‌లో కోటి 60 లక్షల రూపాయలతో ప్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, దీంతో ఇక్కడ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు.

- Advertisement -

విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని, రాష్ట్రంలో జగన్ వివిధ బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారాయన. త్వరలోనే విశాఖ నుంచే ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటన చేశారు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి. . ఈ ప్లోటింగ్ బిడ్జ్ వలన పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని వివరించారు. జగన్ మోహన్ రెడ్డి… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వివిద బీచ్ ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో పరిపాలన రాజధాని ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం ఉంటుందన్నారు. విశాఖ నుండే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుందని చెప్పారు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement