Sunday, April 28, 2024

TS : మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

చెన్నూర్, ప్రభన్యూస్: రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాల‌ను ఎమ్మెల్యే వివేక్ వెంక‌ట‌స్వామి ప‌రామ‌ర్శించారు. చెన్నూరు మండలం కత్తారశాల‌లోని లైన్ గడ్డ ప్రాంతానికి చెందిన సైఫ్ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు. ఒత్కులపల్లి గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి చెందాడు. ఈ విష‌యం తెలుసుకున్న ఆయ‌న ఆదివారం ఉద‌యం వారి మృత‌దేహాల‌ను సంద‌ర్శించి నివాళ్ల‌ర్పించారు. అనంత‌రం మృతుల కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు. వారికి అండ‌గా ఉంటాన‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement