Monday, April 29, 2024

Devaragattu – కర్రల సమరంలో రక్త సింధూరం – 110 మందికి పైగా గాయాలు

కర్నూలు -దేవరగట్టు బన్నీ ఉత్సవంలో సంప్రదాయమే గెలిచింది. ఈ ఉత్సవంలో సంప్రదాయం మాటున చెలరేగే హింసను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం తో పాటు, ప్రభుత్వ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫలితంగా దేవరగట్టులో కర్రల సమరం మాటున చెలరేగిన హింస మూలంగా 110 పది మంది గాయపడ్డారు. దసరా పండుగ సందర్భంగా జరిగే దేవర గట్టు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జరిగిన బన్నీ లో హింస చెలరేగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 11 గ్రామాలకు చెందిన భక్తులు, జనం కర్రలు చేతపట్టి డుర్ ..ర్ పరాక్ అంటూ కర్రల సమరం చేశారు

.దీంతో జరిగిన ఈ హింసలో దాదాపు 110 మందికిపైగా గాయాల పాలయ్యారు.వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా దేవరగట్టులో స్వామి, అమ్మవారికి కళ్యాణం అనంతరం ఊరేగింపులో హింస చెలరేగినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement