Sunday, May 5, 2024

ఆగస్టు నుండి పెంచిన జీతాలను జమ చేయండి.. సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్‌ విజ్ఞప్తి

అమరావతి, ఆంధ్రప్రభ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబిషన్‌ డిక్లేర్‌ చేసినందున ఆమేరకు పెంచిన వేతనాలను ఆగస్టు 1 నుండి జమ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానీ పాషా డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజ‌రీస్‌కు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ గత నెల జూన్‌ 25వ తేదీన ప్రోబేషన్‌ డిక్లేర్‌ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానా శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టి జాప్యం జరగకుండా ఆగస్టు1 వ తేదీన పెరిగిన వేతనాలు చెల్లించాలని కోరినట్లు తెలిపారు.

దీనిపై స్పందించిన డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజ‌రీస్‌ యన్‌.మోహన్‌ రావు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి మరియు ఫెడరేషన్‌ నాయకులు జీ నవీన్‌, రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement