Friday, April 26, 2024

పరీక్షలు రద్దు చేయండి: రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం సృష్టిస్తుంటే పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం తగదంటూ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం అడుగులు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలుగా భావించి పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయాలని కోరారు. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు రు.5 వేల రూపాయల ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యవసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. కరోనా ఉదృతిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement