Sunday, May 5, 2024

ఏపీ కోసం ప్రధానిని కలుద్దాం: సీపీఐ రామకృష్ణ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ప్రధానిని కలుద్దామని సీపీఐ నేత రామకృష్ణ రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఎంపీలను కలుస్తామన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్‌కు ఇస్తున్నారని, రామాయపట్నం పోర్టు ముందుకు సాగడం లేదని తెలిపారు. గంగవరం పోర్టును ప్రైవేట్‌కు ఇవ్వడంలో ప్రధాని, సీఎం కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement