Sunday, May 5, 2024

వివేకా,, కోడి కత్తి కేసులను పక్కదారి ప‌ట్టించేందుకే జ‌గ‌న్ విశాఖ రాగం – సిపిఐ రామ‌కృష్ణ

తిరుపతి సిటీ ఏప్రిల్ 20 (ప్రభ న్యూస్): జగన్ బెయిల్ రద్దు అయితే ఏ జైలుకు వెళతారో తెలియని జగన్ నువ్వే మా భవిష్యత్ అని స్టిక్కర్లు అతికించడం సిగ్గుచేటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు అయితే వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమిటో ముందు స్టిక్కర్లు అతికిస్తున్న ఎమ్మెల్యేలు చూసుకోవాలని హితవు పలికారు. గురువారం తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఇరిగేషన్ వంటి రంగాలలో ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. ఒక కొత్త పరిశ్రమను కూడా నెలకొల్పోలేదని రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

దేశంలో ఉద్యోగాలు రాని పట్టబద్రుల శాతం 17 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35% ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి తాము ఎంతో చేశామని ప్రజలంతా 80% తమవైపే ఉన్నారని చెబుతున్న ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని పదేపదే చెప్పడం ఓటమి భయంతోనే అన్నారు. రాష్ట్రoలో విపక్షాలు అంతా ఒక్కటైతే మీకెందుకు అని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ, ఓటమి భయంతోనే పదే పదే విపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికలలో వైసీపీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలను ఓడించడమే ధ్యేయంగా విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.

దొంగే,,,దొంగ అన్నట్లుంది, సీఎం జగన్మోహన్ రెడ్డి పని తీరు అని ఎద్దేవ చేశారు. వివేకా హత్యకేసు, కోడి కత్తి కేసులను పక్కదారి పట్టించేందుకే పరిపాలనంత సెప్టెంబర్ నుంచి విశాఖకు వెళ్లనున్నట్లు సిఎం ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే సెప్టెంబర్ దాకా ఎందుకని ఇప్పుడే ముఖ్యమంత్రి విశాఖలో క్యాంప్ కార్యాలయం పెట్టుకోవచ్చునని అయితే రాజధాని మాత్రం అమరావతే అన్నారు .కోర్టులు అన్నా, చట్టాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారన్నారు. విశాఖలో రూ.40 వేల కోట్ల భూముల కుంభకోణంకు వైసిపి నాయకులు పాల్పడ్డారని రామకృష్ణ పేర్కొన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు,సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ,నగర కార్యదర్శి విశ్వనాథ్ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement