Thursday, April 25, 2024

Breaking: మంత్రి అంబటిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్లకు పాలడ్డారని ఆరోపణలున్నాయి. అంబటి నేతృత్వంలో టికెట్లు అమ్ముతున్నారని ఆరోపిస్తూ.. జనసేన నేతలు సత్తెనపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయకపోవడంతో జనసేన నేతలు కోర్టుకెళ్లారు. దీంతో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement