Thursday, May 2, 2024

రణభేరి కాదు లాలూచీ, కుస్తీ సభ: బీజేపీపై తులసి రెడ్డి ఫైర్

ఏపీ బీజేపీ నిర్వహించిన రణభేరిపై ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మండిపడ్డారు. రాయలసీమకి బిజెపి అన్యాయం చేసి కడపలో రణభేరి సభ పెట్టి మరోసారి రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. కడపలో బీజేపీ పార్టీ పెట్టిన సభ లాలూచీ, కుస్తీ సభ అని ఎద్దేవా చేశారు. ఏపీకి  ప్రత్యేక హోదా కాంగ్రెస్ 5 ఏళ్ళు ప్రకటిస్తే దాన్ని బీజేపీ అమలు చేయలేదని మండిపడ్డారు. బీజేపీ ఏడూ సంవత్సరాలగా  రాయలసీమని మోసం చేస్తూనే ఉందన్నారు.

దేశాన్ని బీజేపీ అప్పులకుప్ప చేస్తే రాష్ట్రాన్ని వైసీపీ అప్పుల కుప్పగా చేసిందని మండిపడ్డారు. ఐదు  రాష్ట్రాల ఎన్నికల ను కాంగ్రెస్ పార్టీ పురలోచిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం అన్న చేయాలి లేదంటే బ్రోకర్ పనులు మానుకోవాలని వ్యాఖ్యానించారు. ఏపీలో అనిల్ బ్రదర్ పార్టీ పెట్టచు పెట్టకపోవచ్చు అని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని రిలయన్స్ కంపెనీ కుట్ర చేసి చంపేసింది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ముకేష్ అంబానీ చెప్పిన వ్యక్తికి రాజ్యసభ సిటు ఎలా ఇచ్చాడో చెప్పాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement