Sunday, May 5, 2024

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ నేటి ఢిల్లీ పర్యటన రద్దయింది. శనివారం సీఎం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఆయన కాలు బెణకడంతో పర్యటన వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తుండగా సీఎం జగన్ కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కాలు నొప్పి నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సీఎంకు బదులు హోంమంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. ఇందు కోసం ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండిః వైద్య ఆరోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

Advertisement

తాజా వార్తలు

Advertisement