Friday, April 26, 2024

Breaking: సీఎం జగన్ విశాఖ పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి విశాఖ పర్యటన రద్దయ్యింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేటి సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన రద్దు అయింది. అయితే, పర్యటన రద్దుకు గల కారణాలను ప్రభుత్వం చెప్పడం లేదు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. ఒక వేళ ఈ పర్యటన రద్దు కాకుంటే.. ఇవాళ విశాఖలో సీఎం జగన్‌ పర్యటించి ఉండే వారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొని అనంతరం పలు శుభకార్యాల్లో పాల్గొనేవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement