Monday, April 29, 2024

CM JAGAN: ఇవాళ కాకినాడకు సీఎం..వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు ప్రారంభం…

ఏపీ సీఎం జ‌గ‌న్ కాకినాడలో ఇవాళ పర్యటించనున్నారు. కాకినాడలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం కాకినాడ చేరుకానున్నారు.

కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించనున్నారు. సభ అనంతరం సీఎం జగన్ మధ్యాహ్నం తాడేపల్లి చేరుకొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement