Tuesday, April 30, 2024

గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌నున్న‌ సీఎం జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్య‌క్రియ‌ల క్ర‌తువు ప్రారంభ‌మైంది. ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీ స‌మీపంలో అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరికి చేరుకున్నారు. గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌ల్లో సీఎం జ‌గ‌న్ పాల్గొననున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయి. అంత్య‌క్రియ‌ల‌కు భారీగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. ప‌లువురు వైసీపీ నేత‌లు కూడా ఉద‌య‌గిరికి చేరుకున్నారు. గౌత‌మ్ రెడ్డి కుమారుడు అమెరికా నుంచి రావ‌డం ఆల‌స్యం కావ‌డంతో ఈరోజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement