Saturday, May 18, 2024

నేడు విశాఖ‌లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న – హ‌ర్యానా సీఎంతో భేటీ

నేడు విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు సీఎం జ‌గ‌న్.. ఈ మేర‌కు విశాఖ‌లో హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో భేటీ కానున్నారు.గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన తర్వాత ఉదయం 11.10 గంటలకు జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయంలోనే పార్టీ నేతలు, అధికారులతో అరగంట పాటు ఆయన సమావేశమవుతారు. అనంతరం రుషికొండలోని పెమా వెల్ నెస్ సెంటర్ కు వెళ్లి ఖట్టర్ ను కలుస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ఆయన తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.నేచురోపతి ట్రీట్మెంట్ కోసం ఖట్టర్ విశాఖకు వచ్చారు. ఇద్దరు సీఎంల భేటీ సాధారణమైనదేన‌ట‌. అయితే, ఖట్టర్ వ్యక్తిగతంగా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు కావడంతో… ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే యాంగిల్ లో రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement