Monday, April 29, 2024

CM Jagan: వైఎస్ఆర్సీపీ లక్ష్యాలు సాకారం అవుతున్నాయి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 11 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం అని ఆయన అన్నారు. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నామని తెలిపారు. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి అని, మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అని సీఎం జగన్ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement